ఘనంగా ఆంజనేయ స్వామి జన్మదిన వేడుకలు

– ఆంజనేయ స్వామి జన్మదిన వేడుకల్లో  ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు, కలిసి ప్రత్యేక పూజలు చేశారు
నవతెలంగాణ – మద్నూర్
మంగళవారం నాడు ఆంజనేయస్వామి జన్మదిన వేడుకలకు జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే పాల్గొని పార్టీలకు అతీతంగా కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాల భక్తుల్లో ప్రసిద్ధిగాంచిన మన రాష్ట్ర సరిహద్దు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం నాడు ఆంజనేయ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో కొనసాగుతుంది ఈ ఆలయాన్ని సందర్శించి మొక్కుకున్న మొక్కులు కోరికలు తీరుతాయని నమ్మకం. మూడు రాష్ట్రాల భక్తుల్లో రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా ప్రత్యేక అధికారుల్లో ప్రసిద్ధిగాంచిన ఆలయానికి ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి జన్మదిన వేడుకలకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ జుక్కల్ ఎమ్మెల్యే హాజరు కావడం విశేషం. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి జన్మదిన వేడుకలకు మూడు రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు దర్శించుకోవడానికి మబ్బున నాలుగు గంటల నుండి క్యూ కట్టారు. భక్తుల సహాయార్థం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణంలో పెద్ద జాతర నిండింది వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మద్నూర్ ఎస్సై బిచ్కుంద సీఐ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. ఈ ఆలయ సందర్శన ప్రత్యేకత ప్రతి సంవత్సరం జన్మదిన వేడుకల రోజున మూడు రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలి రావడం మూడు రాష్ట్రాల సరిహద్దు ఆలయం మూడు రాష్ట్రాల భక్తుల్లో ప్రఖ్యాత గాంచింది.

Spread the love