ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు..

– హనుమాన్ ఇరుముడి మహోత్సవం
– తరలివచ్చిన భక్తులు
– మహా అన్నదాన కార్యక్రమం
నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని కాటాపూర్ రామాలయం వద్ద శనివారం ఘనంగా హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా ఘనంగా హనుమాన్ ఇరుముడి మహోత్సవం నిర్వహించారు. 31 రోజు దీక్ష పూర్తి చేసుకున్న ఆంజనేయ స్వామి మాలాదారులు శనివారం ఇరుముడి మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాటాపూర్ రామాలయం ప్రాంగణంలో గణపతి హోమం, నవగ్రహాల పూజలను వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. అనంతరం ఇరుముడి మహోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. గ్రామంలోని మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి ఇరుముడి ప్రాంగణం వద్ద భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో గ్రామంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి కూర రాజు, అంజన్న స్వాములు దేవరకొండ రాజు, రంగు సత్యనారాయణ, కాయితి కృష్ణ చారి, మార్క ప్రణయ్, గడ్డం సత్యం మొదలగు 41 మంది ఆంజనేయ స్వాములు, దాతలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love