మండలంలో ఘనంగా ఉగాది వేడుకలు

నవతెలంగాణ – తాడ్వాయి
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారి వారి గ్రామాలలో ఉన్న ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా శోభకృత్ నామ సంవత్సరానికి స్వస్తి చెప్పి, క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టడం, ఈ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సౌభాగ్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామ పురోహితులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం చేశారు. వివిధ కుల వృత్తుల వారు వారి యొక్క పరికరాలను, పనిముట్లను శుభ్రం చేసి వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాటాపూర్ గ్రామంలో గౌడ కులస్తులు ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారి వారి గ్రామాల పెద్దలు, వివిధ సంఘాల నాయకులు యువకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love