క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

– పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా…
నవతెలంగాణ-అశ్వారావుపేట
స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 76 వ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేసారు.  పట్టణం లోని ఖమ్మం రోడ్ లో గల ఆటో యూనియన్  ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. డ్రైవర్స్ కాలనీలోని హోసన్నా మందిర్ లో పాస్టర్ అశోక్  ఆధ్వర్యంలో జరిగిన ప్రార్థనా వీరుల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాస్టర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అశ్వారావుపేటలో సెంటర్ లైటింగ్,డిగ్రీ కళాశాల,100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించి అభివృద్ది పథంలో ఎమ్మెల్యే గారు నడుపుతున్నారని అన్నారు.మంచి చేసే వారి పై ప్రభువు యొక్క దీవెనలు ఉంటాయన్నారు. రానున్న రోజుల్లో కూడా ఎమ్మెల్యేగా మెచ్చా నాగేశ్వరరావు కొనసాగాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ ప్రార్థనా సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని భగవంతుని ఆశీస్సులతో ఎమ్మెల్యే గా గెలిచి ఆయన చల్లని దీవెనలతో అభివృద్ది చేశానన్నారు.డ్రైవర్స్ కాలనీలో సీసీ రోడ్డు కూడా మంజూరు చేశానని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు,ఎంపీపీ, జెడ్పీటీసీ,వైస్ ఎంపీపీ,ఎంపీటీసీలు, సర్పంచ్ లు,ఉప సర్పంచ్,మండల నాయకులు,యువ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Spread the love