డిచ్ పల్లి కు డిగ్రీ కళాశాల మంజూరు..

– జారీ చేస్తూ ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు..
నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ ఉన్నత విద్యా శాఖ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్‌పల్లి లో డిగ్రీ కళాశాల మంజూరుకు సంబంధించిన ఉత్తర్వును సోమవారం G.O.Ms.No.60 నోరుజారి చేసింది. ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్ పల్లి లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.దానిలో భాగంగానే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్‌పల్లిలో డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ఉన్నత విద్యా కమిషనర్ కరుణ వాకిటి పేరుపై జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు మందులు పత్రాలు అందాయి.ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇచ్చిన హామీ నేరవేర్చారని బహుశా ఈ నూతన విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం అవుతుందని బిఅర్ఎస్ నాయకులు వివరించారు.మంజురు రావడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Spread the love