బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన జి ఎస్ ఫోర్ ఎస్


నవతెలంగాణ భీంగల్: భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన జి ఎస్ ఫోర్ ఎస్ సొసైటీ అధ్యక్షుడు పిల్లోల గంగ స్వామి చెంగల్ గ్రామానికి చెందిన ఎనుగందుల నర్సు కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎనుగందుల నర్సు భర్త చనిపోవడంతో తన నలుగురు కూతుర్లతో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉంటూ ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడుతూ జీవనం సాగేస్తున్న విషయాన్ని తెలుసుకున్న గంగ స్వామి శుక్రవారం పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేసి వారికి ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలం ఇప్పించుటకు కృషి చేస్తామని భరోసా కల్పించారు.

Spread the love