కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడగొట్టిస్తా..

నవతెలంగాణ – హైదరాబాద్: ఏ ఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష భర్త సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిని నమ్ముకొని మోసపోయా. రేవంత్ బీఆర్ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని చూస్తున్నాడు.. నాలాంటి రేవంత్ బాధితులను కలుపుకుని కొడంగల్లో ఆయన్ని ఓడగొట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఉప్పల్ లో నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తాను అని సర్వేలన్నీ చెప్పాయి. GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. రెండు సీట్లయితే.. మా భార్య కార్పొరేటర్ గా గెలిచిందన్నారు. గత తోమిదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేశా. పార్టీ సచ్చిపోతుంది అనుకున్నప్పుడు పార్టీలో ఎవరు లేరు.  నేను రేవంత్ రెడ్డికి సన్నిహితుడిని.. ఎన్ని కష్టాలు ఎదురైన పార్టీతోనే ఉన్న. 2014లో టికెట్ అన్నారు.. ఆ తరువాత 2018లో అన్నారు.. ఇప్పుడు కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. కనీసం సెకండ్ ఆప్షన్ గా కూడా నా పేరు స్క్రీనింగ్ కమిటీలో పెట్టలేదు. పరమేశ్వర్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డికి లేదు.  బీఆర్ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని రేవంత్ చూస్తున్నాడని మండిపడ్డారు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్స్ ఇచ్చి పార్టీని నాశనం చేయాలని రేవంత్ చూస్తున్నాడు. టీడీపీ లాగా పార్టీని నాశనం చేసి ప్రాంతీయ పార్టీ స్థాపించాలని రేవంత్ చూస్తున్నాడని సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

Spread the love