తిరుమల తిరుపతిలో భారీ వర్షం ..

నవతెలంగాణ – తిరుమల: ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఎండలు దంచికొడుతున్నాయి. విపరీతంగా కొడుతున్న ఈ ఎండ కారణంగా ప్రముఖ దేవాస్థానాల్లో ఒకటైన తిరుపతి కొండపై భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వరుస సెలవులు వచ్చినప్పటికీ రద్దీ పెరగలేదు. తర్వాత ఈ రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా వాతారణంలో భారీగా మార్పులు వచ్చాయి. ఉరుములు, మెరుపులు, మబ్బులు కమ్మి భారీ వర్షం కురిసింది. తిరుపతి దేవస్థానం సమీపంలోని మాడ వీధల చుట్టుపక్కల ఈ వర్షం పడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, వడగాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు ఒక్కసారిగా నేడు కురిసిన వర్షంతో చాలా ఉపశమనం పొందారు.

Spread the love