నవతెలంగాణ – అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కేఏ పాల్ మీడియాలో పనిచేసే మిత్రులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు, తన హామీలకు మీడియా కవరేజ్ ఇవ్వాలని.. అలా చేసిన వారందరికీ.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంచుతానని కేఏ పాల్ ప్రకటించారు. కాగా ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేఏ పాల్కు ఎన్నికల సంఘం కుండ గుర్తును కేటాయింది. దీంతో ప్రజాశాంతి తరపున ప్రత్యేక మేనిఫెస్టోను పాల్ విడుదల చేశారు.