అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలి


– వ్యకాస కామారెడ్డి జిల్లా కార్యదర్శి నర్సింలు
నవతెలంగాణ-భిక్కనూర్: అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు తెలిపారు. గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 29వ తేదీ నాడు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, పోడు భూముల కోసం కరెక్ట్ కలెక్టర్ కార్యాలయానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ధరణి ద్వారా నష్టపోయిన రైతులు, అసైన్ భూములు రికార్డు లేనివారు ధర్నాలు పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోశయ్య, లక్ష్మి, ఎల్లవ్వ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love