పోలీసుల తనిఖీల్లో భారీగా న‌గ‌దు ప‌ట్టి‌వేత

నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పోలీసుల వాహనా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలో కాటాపూర్ క్రాస్ వద్ద, జాతీయ రహదారిపై స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తనిఖీలు నిర్వహిస్తుండగా కాటాపూర్ గ్రామానికి చెందిన పాలకుర్తి సాయిబాబా వద్ద 60 వేల రూపాయలు, గోవిందరావుపేట మండల వాసి వద్ద 62,500 రూపాయలు, మొత్తం 1,22,500 రూపాయల ను ఇలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తుండడంతో స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్టు తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
Spread the love