సతీష్ కుమార్ తోనే హుస్నాబాద్ అభివృద్ధి 

– ఇంటింటి ప్రచారంలో  బీఆర్ఎస్ అభ్యర్థి అల్లుడు
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్:  హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ తోనే హుస్నాబాద్ అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ అల్లుడు డాక్టర్  అనురాగ్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి, పందిళ్ళ, మహమ్మదాపూర్ గ్రామాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ కుమార్ కు మద్దతుగా ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో గ్రామ, గ్రామానికి బీటీ రోడ్లు, సిసి రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, వివిధ సామాజిక భవనాలు, పాఠశాలలు, త్రాగునీరు, సాగునీరు అలాగే హుస్నాబాద్ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా సతీష్ కుమార్ అభివృద్ధి చేశారని తెలిపారు. ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ ను మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్ దేవసాని సుశీల, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని, ఎంపీపీ మానస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love