నేడు గుండారెడ్డిపల్లి సిద్ధప్ప ఆశ్రమంలో గురుపూజోత్సవం

నవతెలంగాణ-కోహెడ 

కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లి గ్రామ సిద్ధప్ప వరకవి ఆశ్రమంలో సోమవారం కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నట్లు సిద్దప్ప నిర్వాహకులు తెలిపారు. అలాగే తెలంగాణ వేమనగా ప్రసిద్ధిగాంచిన సిద్ధప్ప విగ్రహం వద్ద ఘనంగా గురుపూజోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. సిద్ధప్ప వరకవి చిత్రపటంతో గ్రామంలో ఊరేగింపు జరిపి అనంతరం ఆశ్రమంలో సిద్ధప్ప వరకవి సమాధి వద్ద గురుపూజోత్సవం, కార్తీక పౌర్ణమి వేడుకలు జరుపనున్నట్లు తెలిపారు. సరస్వతీ పూజ, గాయత్రి యజ్ఞం, భజనలతోపాటు అన్నదాన కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి సిద్ధప్ప భక్తులు, అభిమానులు, శిష్యులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. పౌర్ణమి వేడుకలకు ఆశ్రమాన్ని సిద్దం చేసినట్లు బాధ్యులు అనంతవరం వీరేశలింగం, మాణిక్యలింగంలు తెలిపారు.
Spread the love