కమ్యూనిస్టేతర అభ్యర్ధులను గెలిపిస్తే పార్టీలు మారటం గ్యారంటీ

– సీపీఐ(ఎం) నాయకులు బాలరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట :
బూర్జువా,పెట్టుబడిదారుల పార్టీలు ప్రకటించే ఉచిత గ్యారంటీ లు అమలు చేస్తారో లేదో కానీ వారి సారధ్యంలో నడిచే పార్టీల కాంగ్రెస్,బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపిస్తే మాత్రం పార్టీలు మారటం గ్యారంటీ అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు అన్నారు.
ప్రజా సంఘాలు బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్ రావు పిట్టల విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం మండలంలోని పండు వారి గూడెం,దబ్బతోగు,నారాయణపురం,కావడిగుండ్ల,మామిళ్ళవారి గూడెం ల్లో మండల కమిటీ సభ్యులు సోడెం ప్రసాద్,గడ్డం సత్యనారాయణ నేతృత్వంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో బాలరాజు పాల్గొని ప్రసంగించారు. అయిదేళ్ళు కు ఒక సారి పార్టీలు మారే వారికి మీ అమూల్యం అయిన ఓటును వేసి అపవిత్రం చేసుకోవద్దని,జీవితాంతం ఒకే పార్టీలో ఉంటూ నిరంతరం ప్రజా సేవకు అంకితం అయ్యే సీపీఐ(ఎం) అభ్యర్ధులకు ఓట్లు వేసి ప్రశ్నించే గొంతుకలు ను అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మడకం గోవిందు,పెంటారావు,పొట్టా రంగారావు,మడకం రామక్రిష్ణ,కవులూరి వెంకటేష్,రవి,పెరమయ్య లు పాల్గొన్నారు.
Spread the love