ఐఎఫ్‌ఎస్‌ తుది ఫలితాలు విడుదల..

నవతెలంగాణ – హైదరాబాద్ : యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 3 వరకు మెయిన్‌ పరీక్ష నిర్వహించగా.. ఏప్రిల్‌ 22 నుంచి మే 1 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఫలితాలను UPSC బుధవారం విడుదల చేసింది. అభ్యర్థులు సాధించిన మెరిట్‌ ఆధారంగా ర్యాంకర్ల జాబితాను విడుదల చేసింది. వీరిలో మొత్తం 147 మందిని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు రికమెండ్‌ చేసింది. జనరల్‌ కేటగిరీలో 43 మందిని ఎంపిక చేయగా.. ఈడబ్ల్యూఎస్‌ 20, ఓబీసీ 51, ఎస్సీ 22, ఎస్టీ 11 మంది చొప్పున ఎంపికయ్యారు.
టాప్ 10 ర్యాంకర్లు వీరే..
రిత్విక పాండే
– కాలె ప్రతీక్ష నానా సాహెబ్‌
– స్వస్తిక్‌ యదువంశీ
– పండిట్‌ షిరిన్‌ సంజయ్‌
– విద్యాన్షు శేఖర్‌ ఝా
– రోహన్‌ తివారి
– కావ్య వైఎస్‌
– ఆదర్శ్‌ జి
– పంకజ్‌ చౌధరి
– శశాంక్‌ భరద్వాజ్‌

Spread the love