ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు..

నవతెలంగాణ – ఆర్మూర్  

రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎంప్లాయిస్ యూనియన్ 11వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను శుక్రవారం జి రవిచందర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏఐటియుసి ఎయిర్ బస్ సెక్రటరీ శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రాష్ట్ర కార్యదర్శి గోపి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. కార్మికుల పక్షాన ఉన్న ఒకే ఒక్క యూనియన్ ఐక్య ఉద్యమాల సారధి ఎంప్లాయిస్ యూనియన్ అని వివరించారు. రావలసినవి రాబోయేవి ఇప్పించడంలో ఎంప్లాయిస్ యూనియన్ ప్రత్యేక పాత్ర వహించింది అని తెలిపారు. ప్రభుత్వాలు ఏవి ఉంటే వాటికి తొత్తులుగా ఉండే యూనియన్ల ద్వారా ఏమి కాదు అని వివరించారు. ఇప్పటికైనా కార్మికులు కార్మికుల పక్షాన పోరాడే ఎంప్లాయిస్ యూనియన్ కు మద్దతు తెలిపి, ఆ యూనియన్ లో చేరవలసిందిగా వారి వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు జి రవి చందర్ అర్గుల్ రమేష్ ,గోపి ,జయ కుమార్, బాలాజీ గోవర్ధన్ , నారాయణ సుధాకర్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love