- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అంతర్జాతీయంగా ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో, ఎయిరిండియా విమానయాన సంస్థ తన సర్వీసులను తగ్గించుకునేందుకు సిద్ధమైంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడం, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా చమురు ధరలకు రెక్కలు రావడం, విమాన కార్యకలాపాల వ్యయం భారంగా మారడం వంటి కారణాలతో జూన్ 1 నుంచి 90 రోజుల పాటు పలు అంతర్జాతీయ, దేశీయ సర్వీసులను తగ్గించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా 22 శాతం, అంతర్జాతీయంగా 27 శాతం మేర విమాన సర్వీసులను కుదించనున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



