నవతెలంగాణ – హైదరాబాద్: వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత తో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్ లో అబ్ధుల్లా షఫిక్(20) అవుట్ అయ్యాడు. ప్రస్తుతం పాక్ జట్టు స్కోరు 9 ఓవర్లకు 48 పరుగులు చేసింది. క్రీజులో ఇమామ్ 22, బాబార్ అజామ్ 5 పరుగులతో ఉన్నారు. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.