నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్లో అక్రమంగా డ్రగ్స్ను తరలించడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ బోటును ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకుంది. గుజరాత్ తీరంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో బోటును అడ్డుకున్నారు. దీనిలో ఉన్న 14 మంది పాకిస్తాన్ జాతీయులను అదుపులోకి తీసుకుని 86 కిలలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో దాదాపు రూ.600 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. గత కొంత కాలంగా భారత్లోకి డ్రగ్స్ను తరలించడానికి ఉగ్రవాదులు, స్మగ్లర్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కోస్ట్ గార్డ్తో పాటు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా పెట్టాయి.