క్రీడాకారులకు ఇండియన్‌ ఆయిల్ ప్రోత్సాహం

– ఇండియన్ ఆయిల్ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య
– పారా ఆర్చర్ శీతల్ దేవికి స్వాగతం
    నవతెలంగాణ హైదరాబాద్: దేశంలోని క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఇండియన్‌ ఆయిల్ ముందుంటుందని ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు. వరల్డ్ నెంబర్ వన్ పారా ఆర్చర్ శీతల్ దేవిని ఇండియన్ ఆయిల్ కుటుంబంలోకి స్వాగతం పలికారు. ఈ ఈవెంట్ లో శీతల్ దేవికి పదవీకాల లేఖను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్‌ఆయిల్‌ దేశంలోని క్రీడా ప్రతిభకు మద్దతు ఇవ్వడంలోనూ, ప్రపంచ స్థాయి ఛాంపియన్‌లను ప్రోత్సహించడంలోనూ ముందుందన్నారు. శీతల్ దేవి ఇండియన్ ఆయిల్ స్పోర్టింగ్ గెలాక్సీలో షైనింగ్ స్టార్ అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి చేతులు లేని ఆర్చర్‌గా ఆమె ప్రయాణం మెచ్చుకోదగినదన్నారు. ఆమె కలలను సాకారం చేయడంలో మరిన్ని అవార్డులు గెలుచుకోవడంలో ఆమెకు కంపెనీ సపోర్ట్ ఉంటుందన్నారు‌.ఈ సందర్భంగా పారా ఆర్చర్ శీతల్ దేవి మాట్లాడుతూ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నన్ను చేర్చుకుని కొత్త శిఖరాలను అధిరోహించేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు ఇండియన్ ఆయిల్‌కు ధన్యవాదాలు అన్నారు. శీతల్ తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన తల్లిదండ్రులు, కోచ్‌ల మద్దతు, దేశం కోసం అవార్డులు గెలుచుకోవాలనే తన సంకల్పంపై మాట్లాడారు. కష్టపడితే ఏదైనా సాధ్యమన్నారు. పట్టుదలతో ప్రతిదీ సాధ్యమేనన్నారు.
శీతల్ దేవి అచంచలమైన దృఢ సంకల్పం, అసాధారణ విజయాన్ని కలిగి ఉంది. కేవలం 16 సంవత్సరాల వయస్సులో ఇటీవలి ఆసియా పారా గేమ్స్‌లో రెండు బంగారు పతకాలు, ఒక రజత పతకం సాధించారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి పారా-ఆర్చర్‌గా పారా స్పోర్ట్స్ వార్షికోత్సవాలలో తన పేరును నిలుపుకున్నారు.
ఇండియన్ ఆయిల్, సామాజిక బాధ్యతతో కలిగిన కార్పొరేట్‌గా, క్రీడాకారులను నియమించుకోవడం, వర్ధమాన ప్రతిభావంతులకు స్పోర్ట్స్ స్కాలర్‌షిప్‌లను అందించడం, ప్రధాన క్రీడా ఈవెంట్‌లను స్పాన్సర్ చేయడం ద్వారా క్రీడలను చురుకుగా ప్రోత్సహించింది. సీఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా క్రీడలకు విశిష్ట సేవలందించినందుకు ప్రతిష్టాత్మకమైన ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ తో కార్పొరేషన్ ప్రయత్నాలు గుర్తించబడ్డాయి. స్కాలర్‌షిప్ పథకంలో భాగంగా ఇండియన్ ఆయిల్ 19 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువ ప్రతిభావంతులను గుర్తించడం, మద్దతు ఇవ్వడం చేస్తుంది. భవిష్యత్తులో క్రీడలలో ఎదగడానికి అవసరమైన వనరులను అందుకుంటారు.
ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ ఉమా తులి, అమర్ జ్యోతి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత దీపా మాలిక్, ఇండియన్ ఆయిల్ ఫంక్షనల్ డైరెక్టర్లు వీ సతీష్ కుమార్, డైరెక్టర్ (మార్కెటింగ్), సుక్లా మిస్త్రీ, డైరెక్టర్ (రిఫైనరీస్), డైరెక్టర్ (ఆర్&డీ హెచ్ఆర్) అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డైరెక్టర్ (పీ&బీడీ) సుజోయ్ చౌదరి, డైరెక్టర్ (పైప్‌లైన్స్) ఎన్ సెంథిల్ కుమార్, ఐవోసీ తదితరులు పాల్గొన్నారు.
Spread the love