విశ్వకర్మ జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికలు అందజేత

నవతెలంగాణ-ఆర్మూర్ : మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని సిద్దుల గుట్ట దగ్గర గల విశ్వబ్రాహ్మణ సంఘం యందు విశ్వకర్మ జయంతి సందర్భంగా యజ్ఞ మహోత్సవం, అన్నదాన కార్యక్రమం ఆదివారం నిర్వహిస్తున్నట్టు పట్టణ అధ్యక్షులు భాను ప్రకాష్ చారి, కార్యదర్శి రవీందర్ లు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా బోధన్ ఎసిపి కిరణ్ కుమార్, పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ బాబు తహసిల్దార్ శ్రీకాంత్ లకు ఆహ్వాన పత్రికలు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ,నియోజకవర్గం ఇంచార్జ్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు హాజరవుతున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వీరాచారి, కోశాధికారి తిరుపతి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love