పార్ట్ టైమ్ టీచర్ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

నవతెలంగాణ – సిద్దిపేట 
జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల,కళాశాలల్లో (హిందీ  మహిళలు ) ,ఆంగ్లం, గణితం, భౌతిక, సాంఘిక శాస్త్రం బోధించడానికి పార్ట్ టైమ్ టీచర్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాలల ప్రాంతీయ సమన్వకర్త నిర్మల తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ పై పోస్టులకు డిగ్రీ, పీజీ, బీఈడీ అర్హత అని, నర్స్  పురుషులు అర్హతలు జిఎన్ఎం,  ఇ టి పురుషులు అర్హతలు  ఎం టెక్ (ఎలక్ట్రానిక్స్)),  సి జి టి కోర్ మహిళలు అర్హతలు ఎం ఎస్సీ వస్త్ర మరియు ఫ్యాషన్ డిజైన్, బి ఎస్సీ. ఫ్యాషన్ డిజైన్ అర్హతలు కలిగి ఉండాలన్నారు.   అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుమని, అభ్యర్థులు జూలై 12న మిట్టపల్లి గురుకుల పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహించే డెమోకు హాజరు కావాలన్నారు. ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.
Spread the love