సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత

నవతెలంగాణ- వీణవంక

మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి నిధులు మంజూరయ్యాయి. కాగా ఆ చెక్కును ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్పు పాడి కౌశిక్ రెడ్డి లబ్ధిదారులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పేదలకు అండగా నిలబడేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ ముసుపట్ల రేణుక తిరుపతిరెడ్డి, జెడ్పి టిసి మాడ వనమాల సాధవరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి, ఉపసర్పంచ్ బిక్షపతి, రెడ్డిపల్లి సర్పంచ్ పోతుల నరసయ్య, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love