రైతుబంధును నిలిపి వెయ్యమనడం సిగ్గుచేటు

నవతెలంగాణ- రాజంపేట్: రైతుబంధును నిలిపివేయాలంటూ  కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తంకుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటు అని గురువారం రాజంపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బిక్కాజి బలవంతరావు పేర్కొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని చౌరస్తాలో  ఉత్తంకుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిల  దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొండా హనుమాన్లు, పిఎసిఎస్ చైర్మన్ నల్లవెల్లి అశోక్, గ్రామ సర్పంచ్ ఆముదాల సౌమ్య, సీనియర్ నాయకులు జూకంటి  మోహన్ రెడ్డి, తలమడ్ల ఎంపిటిసి రాజు, నాందేవ్, రమేష్, నరేష్ శ్రీరామ్ సురేష్  నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love