డి ఏ చెల్లిస్తున్నట్లు ప్రకటించడం హర్షనీయం

నవతెలంగాణ  ఆర్మూర్  

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా టీఎస్ ఆర్టీసీ గత సంవత్సరం జూలైలో ఇవ్వవలసిన 4.9 డి ఏ ను చెల్లిస్తున్నట్లు ప్రకటించడం హర్షనీయమని టీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రవి చందర్ శుక్రవారం హర్షం వ్యక్తం చేసినారు. తెలంగాణ ఉద్యమంలో టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించినారని ,,20 11 సంవత్సరంలో దాదాపు 29 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినారని, దశాబ్ది ఉత్సవాల కానుకగా ఉద్యోగులకు డి ఏ లను మంజూరు చేయాలని యాజమాన్యం నిర్ణయించడం అభినందనీయమని అన్నారు.
Spread the love