డిప్యూటేషన్ మీద వెళ్లిన వ్యక్తి స్థానంలో మరొకరిని డిప్యూటేషన్ ఇవ్వడం హాస్యస్పదం 

– డీటీఎఫ్ మండల అధ్యక్షుడు మండల రాజు 
నవతెలంగాణ – నెల్లికుదురు
డిప్యూటేషన్ మీద వెళ్లిన వ్యక్తి స్థానంలో మరొకరిని డిప్యూటేషన్ ఇవ్వడం హాస్యస్పాదమని డిటిఎఫ్ మండల అధ్యక్షుడు మండల రాజు అన్నాడు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గౌట్ హైస్కూల్ నెల్లికుదురు పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ గా  కాంప్లెక్స్ లోని అన్ని రకాల బిల్ల్స్ చేసే అర్హత ఉన్న   జి.గణేష్  ని మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి  ఆఫీస్ లో గత మూడు సంవత్సరాల నుండి  డి ఈ ఓ గారి ఎలాంటి ఉత్తర్వులు గౌట్ హైస్కూల్ ఆఫీసులో ఇవ్వకుండానే డిప్యూటేషన్ మీద తీసుకోవడం జరిగింది. అతని స్థానంలో గౌట్ హై స్కూల్ కి డి .ఇ.  ఓ. ఆఫీస్ లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ నరేంద్రబాబు  ను డిప్యూటేషన్ మీద  నెల్లికుదురు కు ఇవ్వడం జరిగింది. (అంటే డిప్యూటేషన్ మీద వెళ్లిన వ్యక్తి  స్థానంలో మరొకరిని డిప్యుటేషన్ ఇవ్వడం హాస్యాస్పదం ) మా గౌట్ హైస్కూల్లో యాబై మంది ఉపాధ్యాయుల బిల్స్ చేసే గణేష్  ను డి ఈ ఓ ఆఫీస్ కి తీసుకొని ఎలాంటి బిల్స్ చేయడం రాని  నరేంద్రబాబును గౌట్ హైస్కూల్ కు పంపడం వల్ల మాకు మా కాంప్లెక్స్ కు ఎలాంటి ఉపయోగం లేదు , దీనివల్ల కాంప్లెక్స్ లో నీ ఉపాధ్యాయులందరూ వారికి సంబంధించిన మెడికల్ బిల్లులు, ఇతర సప్లమెంటరీ బిల్లులు ఐదు, ఆరు నెలల నుండి పెండింగ్లో ఉండి బిల్స్  చేయించుకోవడంలో ఉపాద్యాయులు తీవ్ర ఇబ్బంది  పడుతున్నారు . కావున డిఇఓ  గౌట్ హైస్కూల్ కు నియమించ బడ్డ గణేష్  ని తిరిగి మా గౌట్ హైస్కూల్ కి పంపాలని డి ఈ ఓ గారిని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భువనగిరి కుమారస్వామి మరియు  జిల్లా కౌన్సిలర్ పెరుమాండ్ల యాదగిరి పాల్గొన్నారు.
Spread the love