బడుగు,బలహీన వర్గాలకు భరోసానిచ్చేది కాంగ్రెస్ పార్టీయే

– సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
నవతెలంగాణ – మంథని
బడుగు,బలహీన వర్గాలకు భరోసానిచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు.ఐటి, పరిశ్రమలు,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,శ్రీపాద ట్రస్టు చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు పెద్దపల్లి ఎంపి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి జనగామ నర్సింగరావు ఆధ్వర్యంలో సోమవారం మంథని మండలం గోపాల్ పూర్, చిన్నఓదాల గ్రామాల్లో మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ప్రతి ఇంటా ప్రభుత్వం అందజేసే పథకాలతో ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని కోరారు.రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తోనే మంథని ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు.పెద్దపల్లి ఎంపి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడంలో ప్రతి కార్యకర్త తనవంతు పాత్ర పోషించాలని కోరారు.ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగ్యారంటీల్లో భాగంగా ప్రజలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తుందని అన్నారు.వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నూకల బాణయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకన్న, సింగిల్విండో డైరెక్టర్ రావికంటి సతీష్ కుమార్,ఎస్సి సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యనారాయణ,ఐఎన్టీయూసి జాతీయ ప్రధానకార్యదర్శి పేరవేన లింగయ్య,మాజీ సర్పంచులు చంద్రు రాజమల్లు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు సేమంతుల ఓదెలు, దొరగొల్ల శ్రీనివాస్,మేడ రాజయ్య,నాగుల రాజయ్య,దాసరి రమ-రాములు,కొండ మహేందర్,  సడువలి,ఊట్ల అనిల్,ఎడ్ల రాజయ్య,పుప్పాల అశోక్,చెన్నవేన సదానందం,పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.

Spread the love