కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాస్తారోక

నవతెలంగాణ-  హుస్నాబాద్ రూరల్ 
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హుస్నాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అన్నారు. 33 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో  హుస్నాబాద్ మండల అధ్యక్షులు గంగారపు దుర్గయ్య, అక్కన్నపేట మండల అధ్యక్షులు వెముగంటి సాయిలు, ఉపాధ్యక్షులు కాసార్ల సదానందం, ప్రధాన కార్యదర్శి వెముగంటి మహేందర్ , సహాయ కార్యదర్శి సిరికొండ సంపత్, కోశాదికారి వెంకటేషం, తిరుమల,  నర్సవ్వ పాల్గొన్నారు.
Spread the love