జగన్ బెయిల్: సుప్రీం కోర్టు కీలక నోటీసులు

నవతెలంగాణ – అమరావతి: జగన్ బెయిల్ రద్దు విషయంలో సుప్రీం కోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. ఎంపీ రఘురామ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. జగన్, సీబీఐ సహా ప్రతివాదులందరికీ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్‌ను సీబీఐ, ఈడీ కనీసం సవాల్ చేయలేదని రఘురామ కోర్టుకు తెలిపారు. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా అని ధర్మాసనం రఘురామను ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ కోర్టుకు తెలిపారు. విచారణను ఢిల్లీకి మార్చాలని ఇప్పటికే రఘురామ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అదే పిటిషన్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

Spread the love