![](https://navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230822-WA00261.jpg)
నవతెలంగాణ-బెజ్జంకి
విశ్వకర్మ సేవా ట్రస్ట్ అధ్వర్యంలో అందజేయనున్న ‘జాతీయ విశిష్ట వైద్య శిరోమణి’పురస్కారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు జానకి రాములును వరించింది. సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 10న విజయవాడలో నిర్వహించనున్న కార్యక్రమంలో జానకి రాములుకు జాతీయ విశిష్ట వైద్య శిరోమణి పురస్కారాన్ని అందజేయనున్నట్టు విశ్వకర్మ సేవా ట్రస్ట్ కమిటీ సభ్యులు మాచవరం గౌరీ శంకరాచార్యులు,బాల బ్రహ్మ చారి బుదవారం ప్రకటనలో తెలిపారు.గత 42 ఎండ్లుగా వైద్య వృత్తిలో విశిష్ట సేవలందిస్తున్నందుకు జానకి రాములును జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్టు ట్రస్ట్ కమిటీ సభ్యులు తెలిపారు.పురస్కారానికి ఎంపికైన జానకి రాములుకు మండల ఆర్ఎంపీల సంక్షేమ సంఘం సభ్యులు,పరువురు గ్రామస్తులు అభినంధనలు తెలిపారు.