మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా బస్ ప్రయాణం ఉచితం: జయవీర్ కుందూరు

నవతెలంగాణ -పెద్దవూర
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆర్టిసీ బస్సుల్లో మహిళల అందరికి ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఒకే సారి రెండు లక్షలు ఋణ మాఫీ అమలు చేస్తామని నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్ రెడ్డి అన్నారు. బుధవారం త్రిపురారం మండలం సత్యనారాయణపురం(క్యాంప్)  గ్రామంలో ప్రచారంలో భాగంగా గ్రామ పొలిమేరలో ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా  మాట్లాడుతూ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బరోసా పథకంలో భాగంగా వరి కొనుగోలులో ప్రతి క్వింటాకు అదనంగా 500 రూపాయలు ఇస్తామని తెలిపారు. 500 లకే గ్యాస్, మహిళలకు ప్రతి నెల ఫస్ట్  తారీఖున 2500 లు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love