- Advertisement -
నవతెలంగాణ-హైదారాబాద్: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రెండు ఎంపీ సీట్లకు పోటీ జరగగా.. ఒక స్థానం నుంచి బీజేపీ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వాని గెలుపొందారు. మరో సీటును జేఎంఎం సొంతం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి వైద్యనాథ్ రామ్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాత్రం షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఏకైక అభ్యర్థి ప్రణవ్ ఝా.. పరిమళ్ చేతిలో ఓడిపోయారు. ఇండియా బ్లాక్ మద్దతు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయి, బీజేపీ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ గెలవడానికి క్రాస్ ఓటింగే కారణమని తెలుస్తోంది.
- Advertisement -



