రేపు కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు..

నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో కూడిన ధర్మాసనం ముందు ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. కాగా ఈ కేసులో కవితను మార్చి 15న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయగా ఆమె తిహార్ జైలులో ఉన్నారు.

Spread the love