కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన బైక్‌

– ఒకరు మృతి, మరొకరికి గాయాలు
– ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు
– తలకొండపల్లి మండలంలో ప్రచారం ముగించుకుని వెళ్తుండగా ఘటన
నవతెలంగాణ-తలకొండపల్లి
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారును బైక్‌ ఢకొీట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యేకు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తలకొండపల్లి మండలంలోని వెల్జాల్‌ గ్రామంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో వెల్జాల్‌ గ్రామ శివారులో గల రామసిపల్లి మైసమ్మ దేవాలయ సమీపంలో మిడ్జిల్‌ రహదారిపై ఎమ్మెల్యే కారును ఎదురుగా వస్తున్న బైక్‌ ఢకొీట్టింది.
ఈ ఘటనలో పబ్బతి నరేష్‌(25) అక్కడికక్కడే మృతిచెందాడు. బైరవపాక పరుశరాములు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే కారు ఎయిర్‌బెలూన్స్‌ ఓపెన్‌ కావడంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఎమ్మెల్యే దగ్గరుండి కల్వకుర్తి ఆస్పత్రికి తరలించి, మెరుగైన చికిత్స అందేలా వైద్యులతో మాట్లాడారు.

Spread the love