మంత్రాల నెపంతో వృద్ధురాలి దారుణహత్య

నవతెలంగాణ-కోదాడరూరల్‌
మంత్రాలు చేస్తుందనే అనుమానంతో వృద్ధురాలిని దారుణ ంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని త్రిపురవ రం గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. నడిగూడెం ఎస్‌ఐ జి.అజరుకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురవరం గ్రామానికి చెందిన కొమ్ము అలివేలమ్మ(70) పశువుల కాపరిగా పని చేస్తూ జీవనం సాగిస్తుంది. ఆమెకు మంత్రాలు వస్తాయనే అనుమానంతో గ్రామానికి చెందిన హుస్సేన్‌ మరో వ్యక్తితో కలిసి అలివేలమ్మ మెడకు తాడును బిగించి హత్య చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు రాంబాబు ఉపాధిహామీ చట్టంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా, కోడలు రాధ గ్రామంలో అంగన్వాడీ టీచర్‌. మృతురాలి మనువడు సాయికృష్ణ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love