– ప్రజలను తప్పుదోవ పట్టించిన సీఎం
– బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి క్రిశాంక్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తన లెటర్ పోర్జరీ అని రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధమని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి క్రిశాంక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అరెస్టు సందర్భంగా మద్దతు తెలిపిన నాయకత్వానికి, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. తాను సోషల్ మీడియాలో ఒరిజినల్ సర్క్యులర్నే పోస్టు చేశానని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి నకిలీ లెటర్ను పోస్టు చేసి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.