నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులుగా కవి యాకూబ్, ప్రధాన కార్యదర్శిగా ఆర్.వాసు(నవతెలంగాణ) ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం పదవీ కాలం రెండేండ్ల పాటు ఉంటుంది. మంగళవారం హైదరాబాద్ బుక్ ఫెయిర్ జనరల్ బాడీ హైదరాబాద్లో సమావేశం జరిగింది. అందులో గతేడాది వరకు నిర్వహించిన కార్యక్రమాలు, అదాయవ్యయాలపై చర్చించారు. అనంతరం బుక్ఫెయిర్ ఎన్నికలను ఎమెస్కో విజయకుమార్, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఉపాధ్యక్షు లుగా శోభన్బాబు, ‘మలుపు’ బాల్రెడ్డి, సహాయ కార్యదర్శులుగా సూరిబాబు, ‘మంచిపుస్తకం’ సురేష్, కోశాధికారిగా నారాయణ రెడ్డి(నవచేతన) ఎన్నికయ్యారు.
ఆయా ప్రచురణ సంస్థల నుంచి జనార్ధన గుప్తా, విజయరావు, మధుకర్, కోటేశ్వరరావు, శ్రీకాంత్, ‘భూమి’ శ్రీనివాస్, సాంబశివరావు, కుమార్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఉండనున్నారు. సమావేశంలో రెండేండ్లుగా బాధ్యతలు నిర్వహించిన పాత కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని అమోదించారు.