కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోలేదు..బీజేపీపై మండ్డిపడ్డ విజయశాంతి

నవతెలంగాణ-హైదరాబాద్: మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. గాంధీభవన్ లో విజయశాంతి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ చెబితే వెళ్లానని చెప్పారు. ఏళ్లు గడిచినా కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతిపరుడని బీజేపీ నేతలు విమర్శిస్తారు.. కేసీఆర్ అవినీతిపరుడైతే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. ఆధారాలు ఉండి కూడా బీజేపీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అన్నారు. తెరపై విమర్శలు.. తెర వెనుక ఒప్పందాలు చేసుకున్నాయని విజయశాంతి ఆరోపించారు. అధ్యక్ష పదవి నుంచి సంజయ్ ను తొలగించవద్దని కోరామన్నారు. సంజయ్ ను తొలగించడంతో బీజేపీ పరువు పోయిందన్నారు. కేసీఆర్ ను  ఓడించడమే ఉద్యమకారుల లక్ష్యమన్నారు.

Spread the love