కేసీఆర్ బీసీలను విస్మరించారు

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
కెసిఆర్ బీసీలను విస్మరించారని నిజామాబాద్ బిజెపి అర్బన్ నియోజకవర్గం నాయకులు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. గురువారం నాగోల్ లో నిర్వహించిన ఓబీసీ సమ్మేళనంలో బీజేపి ఓబిసి జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే.లక్ష్మణ్ కు ధన్పాల్ సూర్యనారాయణ శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా దన్పాల్ సూర్య నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ బీసీలను విస్మరించారు అని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం 28 మంది మంత్రిలలో బీసీలకు పదవులు నియమిస్తే, రాష్ట్రంలో ముగ్గురితో మామ అనిపించిన ఘనత కేసీఆర్ కు దక్కిందని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో బీసీలంతా కేసీఆర్ ను తరిమి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. డాక్టర్ కే.లక్ష్మణ్ కు ఓబీసీ డిక్లరేషన్ ను ప్రకటించడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ అధ్యక్షులు యామాద్రి భాస్కర్, పోత్తన్కర్ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ, పంచ రెడ్డి లింగం, మెట్టు విజయ్, నర్సింగ్ ముదిరాజ్, శ్రీనివాస్, సర్పంచ్ గంగన్న, కోడూరి నాగరాజ్, గట్ల గంగాధర్, శివునూరి భాస్కర్, ప్రభాకర్, భట్టికారి ఆనంద్, కాషా గౌడ్, సురేష్, బిజెపి నాయకులు అర్బన్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love