– సీఎం కేసీఆర్పై చనగాని దయాకర్ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నిరుద్యోగుల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటమాడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి చలగాని దయాకర్ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆరు లక్షల మంది గ్రూప్ 2 అభ్యర్థుల ఆవేదనను ప్రభుత్వం వినాలని కోరారు.
ఆగస్టు నెలలో నాలుగు పరీక్షలు ఉంటే, ఏ పరీక్ష రాయాలో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన తప్పిదాలకు నిరుద్యోగులెందుకు ఆవేదనను అనుభవించాలని ప్రశ్నించారు. రెండు నెలల సమయమిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేందని నిలదీశారు.