సూర్యాపేటలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌

నవతెలంగాణ – హైదరాబాద్: సూర్యాపేట జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. కార్యాలయ ప్రాంగణంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అంతకుముందు రూ.500 కోట్లతో చేపడుతున్న మెడికల్‌ కళాశాలకు సంబంధించి రూ.156 కోట్లతో నిర్మించిన ప్రధాన భవనాలను ప్రారంభించారు.  అనంతరం రూ.30.18 కోట్లతో పాత వ్యవసాయ మార్కెట్‌లో నిర్మాణమైన ఇంటెగ్రేటెడ్‌ మోడల్‌ మార్కెట్‌ను ప్రారంభించి.. మార్కెట్‌ అంతా కలియతిరిగి పరిశీలించారు. రూ.38.50 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకొని ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రి జగదీశ్‌ రెడ్డి, సూర్యాపేట జిల్లా ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్‌, శాణంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌ తదితరులు ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా రూ.38.50 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకొని ప్రారంభించనున్నారు

Spread the love