నవతెలంగాణ హైదరాబాద్: దివంగత మాజీ మంత్రి ముకేశ్గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. గోషామహల్ నియోజకవర్గానికి చెందిన ఆయన.. రాజీనామా లేఖను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డికి పంపించారు. పార్టీలో సరైన ప్రోత్సాహం లేదని.. కొద్దిమందికే అన్ని పదవులు అన్నట్టుగా వ్యవహారం సాగుతోందన్నారు. పార్టీనే నమ్ముకున్న తనలాంటి వారికి తీవ్ర అన్యాయం జరిగిందని, గ్రూపులకే మేలు జరుగుతుందని విక్రమ్ గౌడ్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నా పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విక్రమ్ గౌడ్ తన లేఖలో పేర్కొన్నారు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముంది.