పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఎం.భవాని
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామ పరిధిలోగల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీ బివి) లో 2026–27 విద్యా సంవత్సరానికి సోమవారం స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు స్పెషల్ ఆఫీసర్ ఎం.భవాని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 6వ తరగతిలో 15 సీట్లు,7వ తరగతిలో 20 సీట్లు, ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపిహెచ్.డబ్యూ గ్రూపులో 2 సీట్లు, ఇంటర్ ప్రథమ సంవత్సరం సిఈసి గ్రూపులో 20 సీట్లు అర్హత కలిగిన విద్యార్థినులు తమ ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టిసి), మార్క్స్ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజు ఫోటోలు తదితర అవసరమైన ధ్రువపత్రాలతో సోమవారం ఉదయం పాఠశాలకు హాజరై స్పాట్ అడ్మిషన్ పొందాలని కోరారు.
కేజీబీవీ స్పాట్ అడ్మిషన్స్.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



