ఖమ్మం పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ దే

– గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి
– విస్త్రుత పర్యటనలో ఎంపీపీ జల్లిపల్లి
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాబోవు ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం గెలుచుకునే బీఆర్ఎస్ మాత్రమేనని,అభ్యర్ధి  నామ నాగేశ్వరరావు విజయమే లక్ష్యం గా ప్రతీ కార్యకర్త నడుం బిగించాలని ఎంపీపీ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామ మూర్తి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, అశ్వారావుపేట మండలం లో సోమవారం ఊట్లపల్లి,వినాయక పురం, ఆసుపాక, నందిపాడు, వడ్డి రంగా పురం, గుమ్మడవల్లి, బచ్చు వారి గూడెం పంచాయితీ లో పార్టీ ముఖ్య నాయకుల బృందం విస్త్రుత పర్యటన చేసారు. వచ్చే పార్లమెంటు ఎలక్షన్ లో ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్ధి నామ నాగేశ్వర రావు గెలుపే లక్ష్యంగా బూత్ లెవల్ కమిటీ లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసే విధంగా  ప్రతి గ్రామంలో బూత్ కమిటీ సభ్యులను ఏర్పాటు చేసారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలలోకి తీసుకెళ్తూ వాళ్ళు అమలు చేస్తానని చెప్పిన 6 పథకాలు ఎందుకు అమలు చేయలేదో ప్రతి ఒక్కరికీ వివరిస్తూ రైతు భీమ,రైతు బంధు,గ్యాస్ సబ్సిడీ,ప్రతి మహిళకు రూ.2500 లు,కళ్యాణ లక్ష్మీ తో తులం బంగారం,రైతు రుణమాఫీ,దళిత బంధు, రూ.4000 లు ఫించన్,ఇలా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఫోన్ ట్యాంపరింగ్,లిక్కర్ స్కా ఆని తప్పుడు కేసులను ఎత్తి చూపుతూ ప్రజలని మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారు.ప్రతి ఒక్క కార్యకర్త అర్థమయ్యేలా వివరించి కారు గుర్తుపై ఓటు వేసేలా చూడాలని మండల నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో  పీఏసీఎస్ నారాయణపురం ఉపాధ్యక్షులు పుట్ట సత్యం,జెడ్పీటీసీ పూర్వ సభ్యులు జూపల్లి కోదండ వెంకట రమణారావు,మాజీ వైస్ ఎం.పి.పి మందపాటి రాజమోహన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి యుఎస్ ప్రకాష్ రావు,మండల కార్యదర్శి జుజ్జూరపు వెంకన్న బాబు,బిర్రం వెంకటేశ్వరరావు, నాయకులు వగ్గెల పూజ,డాక్టర్ ప్రసాద్,జుజ్జూరపు శ్రీరామమూర్తి,తల్లాడ వెంకటేశ్వర రావు,రాజ్ కుమార్,పద్దం.జోగారావు, పుట్ట సత్యం,అమీర్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love