నేడు తెలంగాణకు ఖర్గే… రేపు ప్రియాంకా..

నవతెలంగాణ హైదరాబాద్: కాంగ్రెస్‌ విజయభేరి రెండో విడత బస్సు యాత్రలో భాగంగా ఆదివారం సంగారెడ్డి, మెదక్‌లో జరిగే బహిరంగ సభల్లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. కర్ణాటకలోని గుల్బర్గా నుంచి హెలికాప్టర్‌లో నేరుగా సంగారెడ్డికి చేరుకుని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. అక్కడే భోజనం చేసి హెలికాప్టర్‌లో మెదక్‌కు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళ్లిపోతారు. రేపు (సోమవారం) జనగామ, ఆలేరు, భువనగిరి.. 31న(మంగళవారం) నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో కొనసాగనున్న బస్సు యాత్రలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పాల్గొనే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Spread the love