మాదాపూర్‌లో బీజేపీ నేత కిడ్నాప్ కలకలం

నవతెలంగాణ – హైదరాబాద్
మాదాపూర్ లో బీజేపీ నేత కిడ్నాప్ కలకలం రేపింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి మిస్సింగ్ అయ్యాడు. నిన్న మధ్యాహ్నం నుంచి కనబడకుండా పోయాడు శరణ్ చౌదరి. మాదాపూర్ లోని తన ఇంటి నుంచి మధ్యాహ్నం బయటకు రాగానే కారులోకి ఎక్కారు. అయితే.. ఆ కారులో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారని సమాచారం. అనంతరం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి ఫోన్ స్విచ్చాఫ్ అయింది. ఇప్పటి వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి మొబైల్‌ ఆన్‌ కాలేదు. డ్రైవర్, సహాయకుడి ఫోన్స్ సైతం స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో ఆందోళనలో శరణ్ చౌదరి కుటుంబ సభ్యులు ఉన్నారు. మాదాపూర్ పోలీసు స్టేషన్ లో శరణ్ చౌదరి భార్య ఫిర్యాదు చేశారు. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు శరణ్ చౌదరి సిద్ధమయ్యారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు.

Spread the love