అండర్-14 జాతీయ రగ్బీ క్రీడలకు కొంక ప్రణతి ఎంపిక

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామానికి చెందిన కొంక ప్రణతి 8వ తరగతి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతుంది. ఈనెల 11 12 తేదీలలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేఎల్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ 14 బాలికల పోటీల్లో రగ్బీ క్రీడలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎంపికైనది.
ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు జాతీయస్థాయిలో జరిగే 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రగ్బీ పోటీల్లో ఒడిస్సా రాష్ట్రం భువనేశ్వర్ కు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ పోటీల్లో గెలిచి రాష్ట్రానికి ఉమ్మడి జిల్లాకు ఊరుకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని గ్రామ సర్పంచ్ కొర్పూరి సైదులు కొంక ప్రణతిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యాయమ ఉపాధ్యాయురాలు అంబటి రేణుక, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Spread the love