ఖమ్మం కార్పొరేషన్ కు కేటీఆర్ 100 కోట్ల నిధులు మంజూరు

నవతెలంగాణ – హైదరాబాద్: మంత్రిగా నాలుగేళ్ళ పదవీకాలం పూర్తిచేసుకుంటున్న సందర్భంగా మంత్రి అజయ్ కుమార్ కి జీవో అందజేసిన మంత్రి కేటీఆర్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ నాలుగేళ్ళ పదవీకాలం పూర్తిచేసుకుంటున్న శుభ సందర్భంగా ఖమ్మంకు మరోసారి నిధుల వరద పారించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కేటీఆర్ చేసిన విజ్ఞప్తి మేరకు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఖమ్మం కు 100 కోట్ల నిధులను విడుదల చేశారు. నేడు ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదగా జీవో కాపీ ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి అందజేశారు. ఖమ్మం అభివృద్ధికి మరో 100 కోట్ల నిధులు ఇచ్చిన సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా నాలుగేళ్ళ సుపరిపాలన పూర్తి చేసుకున్న అజయ్ కుమార్ కి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love