ఆటో డ్రైవర్‌లకు ప్రమాద బీమా పత్రాలు అందజేసిన కేటీఆర్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌లో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గని వెయ్యి మంది ఆటో డ్రైవర్‌లకు రూ. లక్ష చొప్పున ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. వికలాంగులకు వీల్‌ చైర్‌లను పంపిణీ చేశారు. 70 కిలోల కేక్‌ కటింగ్‌ చేశారు. కేసీఆర్‌ జన్మదిన వేడుకలకు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా హాజరయ్యారు. కేసీఆర్‌ రాజకీయ, ఉద్యమ నేపథ్యంతో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు.

Spread the love