డిజిటల్ క్లాస్ రూమ్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రాం లో పాల్గొన్న కుంభం కీర్తి రెడ్డి..

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
భువనగిరి నియోజకవర్గంలోని పాఠశాలలో కుంభం కీర్తి రెడ్డి  త్వరలో ప్రారంభించబోతున్న ట్రస్ట్ ఆధ్వర్యంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇంస్టాలేషన్ కొరకు సీడ్స్ ఇంపాక్ట్ ఆర్గనైజషన్ తరపున డెమో నిర్వహణ కార్యక్రమానికి హాజరై,  విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి ముట్టచించి మరియు వారి సమస్యలను తెలుసుకుని అవి ఎలా ఫౌండేషన్ ద్వారా అధిగమించవచ్చు అని సీడ్స్ ఇంపాక్ట్ వాళ్ళతో పరస్పర చర్చలు జరిపి వాటిని స్వయంగా పరిష్కరిస్తామని కీర్తి రెడ్డి  హామీ ఇచ్చారు. అనంతరం పిల్లలలో కలిసి డిజిటల్ క్లాస్ రూమ్స్ డెమో కార్యక్రమంలో పాల్గొని, అది పిల్లలకు ఎలా వినిగించుకోవాలి,ఎలా ఉపయోగ పడుతుంది,  వివిధ అంశాల పైన పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది.
Spread the love